Thursday, April 25, 2024

Breaking : ప్ర‌తి కాపు ఓటు వేసి ఉంటే నేను గెలిచేవాడిని.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌

తాను డ‌బ్బుబ‌లాన్ని న‌మ్మ‌డంలేద‌ని తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్..తాడేప‌ల్లి గూడెంలో ఆయ‌న మాట్లాడుతూ..త‌న‌వంతు తాను కృషి చేస్తాన‌న్నారు.పార్టీకి ఇంకా ప్ర‌తికూల ప‌వ‌నాలే ఉన్నాయ‌న్నారు.పార్టీకి ఇంకా అనుకూల‌ప‌వ‌నాలు రాలేద‌న్నారు.ప్ర‌తి కాపు త‌న‌కి ఓటు వేసి ఉంటే గాజువాక‌..భీమ‌వ‌రంలో గెలిచి ఉండేవాడిన‌న్నారు.సంఖ్యాబ‌లం ఉన్న‌చోట వైవిధ్యం ఉంటుంద‌న్నారు.ఓడిపోయాను కానీ వెన‌క్కి త‌గ్గ‌లేద‌న్నారు.ప్ర‌తికూల‌ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డుతున్నాన‌న్నారు.గ‌త 10సంవ‌త్సరాలుగా నానా మాట‌లు అనిపించుకుంటున్నాన‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ల్యాణ్. స‌మాజంలో మార్పురావాల‌నేదే త‌న ఆలోచ‌న అన్నారు.డ‌బ్బుల‌తో పార్టీని న‌డ‌ప‌లేమ‌న్నారు.పార్టీని న‌డిపించేది భావ‌నా బ‌ల‌మ‌న్నారు. ఆ బ‌లంతోనే ల‌క్ష‌లాది మందిని ఒక‌టి చేస్తాం.సీఎంకి వేల‌కోట్లు ఉన్నాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement