Saturday, April 20, 2024

Breaking : క‌డ‌ప అమీన్ పీర్ ద‌ర్గాలో జ‌ర‌గ‌నున్న.. ఉర్సు ఉత్స‌వాల్లో పాల్గొన‌నున్న సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 6న క‌డ‌ప‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం లో ఈ నెల 6 న ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఈ నెల 6వ తేదీన 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు . 11.40 – 12.10 వరకు కడప అమీన్‌ పీర్‌ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. 12.25 – 12.45 కడప మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement