Wednesday, April 17, 2024

Breaking : నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి శంకుస్థాపన చేసిన.. సీఎం జగన్

అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి శంకుస్థాపన చేశారు సీఎం జగన్.తాండవ..ఏలేరు ఎత్తిపోతల పథకం..కాలువల అనుసంధానం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌రాకతో సంక్రాంతి పండగ ముందే వచ్చింది. రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణం కాబోతుంది. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులను ప్రారంభించి.. మనకు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్‌ అన్నారు. 12:01 PM మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన నర్సీపట్నంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement