Thursday, April 18, 2024

Breaking : చెన్నారెడ్డి హత్య కేసులో.. ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష

అనంతపురం .. ప్రభ న్యూస్ : సత్య సాయి జిల్లా ధర్మవరం మండల పరిధిలోని బడన్నపల్లి గ్రామంలో చెన్నారెడ్డి( గాంధీ) హత్య కేసులో 6 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం సెషన్స్ కోర్ట్ మంగళవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. 2017వ సంవత్సరంలో వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగినట్లు అప్పటిలో పోలీస్ కేసు నమోదు అయింది. కేసులో ముద్దాయిలు గంగాధర్, సూర్యనారాయణ, పెద్దన్న, శివయ్య, నాగరాజు, ప్రసాద్ లకు శిక్ష విధించడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలతో కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. అయితే ఇదే కేసు పై హైకోర్టులో ఆపిల్ దాఖలు చేస్తామని వారి న్యాయవాది తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement