Thursday, March 28, 2024

Breaking : డివైడ‌ర్ ను ఢీకొన్న బ‌స్సు .. ప‌లువురికి గాయాలు

ఫిరంగిపురం : స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం తెల్లవారుజామున డివైడర్ ను కర్నూలు నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు 12 మంది ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో పలువురు ప్ర‌యాణీకుల‌కు స్వల్ప గాయాలయ్యాయి.
పెరుగుతున్న ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు :
నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. వారంలో ఒకటి రెండు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఫిరంగిపురంలో 12 ఏళ్ల క్రిందట రోడ్డు విస్తరణలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నుండి మార్నింగ్ స్టార్ కళాశాల వరకు రెండు అడుగుల ఎత్తులో డివైడర్ నిర్మించారు. డివైడర్ అంచుల వద్ద ఇటువంటి సూచిక బోర్డులు, రాత్రి సమయంలో కనిపించు లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం లారీలు, కార్లు, డివైడర్ ను ఢీకొని పడిపోతున్నాయి. వాహనాలకు కింద భాగంలో ఉండే ఆయిల్ ట్యాంకర్, ఇంజన్లు ప్రమాద సమయంలో ధ్వంసమవు తున్నాయి. టైర్లు పే లిపోతున్నాయి. ఆ సమయంలో వాహనంలో ప్రయాణించేవారు గాయాలపాలవుతున్నారు. వాహనాల మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చవుతాయని వాహనాల యజమానులంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జ‌ర‌గ‌వ‌ని పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement