Thursday, April 25, 2024

Breaking : సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కి చిరునామా టీడీపీ.. చంద్రబాబు

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలని ఘనంగా నిర్వహించామన్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాలన్నారు.రాజ‌మండ్రిలో జ‌రుగుతున్న టీడీపీ మ‌హానాడులో ఆయ‌న మాట్లాడారు. టీడీపీలో మరింత జోష్ పెరిగిందన్నారు. సహకరిస్తే సరే..అడొస్తే తొక్కుకుంటూపోతామన్నారు చంద్రబాబు. కార్యకర్తల త్యాగాలను తాను మరచిపోనని చెప్పారు. ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకి తాను అండగా ఉంటామన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అన్నారు. సంపద పేదలకి పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని తెలిపారు చంద్రబాబునాయుడు. సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కి చిరునామా టీడీపీ అన్నారు.తిరిగి రాష్ట్రాన్ని కాపాడ‌టానికి ఒక సంక‌ల్పం తీసుకుంటామ‌న్నారు.టీడీపీ జెండాని చూస్తే ఎక్క‌డ‌లేని ఉత్సాహం వ‌స్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement