Friday, March 29, 2024

బ్రేవ్ చైల్డ్.. టెర్రరిస్టులపై ఎదురుతిరిగింది.. శ్రీకాకుళం చిన్నారికి రాష్ట్రీయ బాల పురస్కారం..

శ్శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వం మహిళాభివృద్ది శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యేటా ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డుకు ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి హిమప్రియ ఎంపికయ్యింది. ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో హిమప్రియను ఈ అవార్డ్ వరించింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ సోమవారం  వర్చ్యువల్ విధానంలో హిమప్రియకు ధ్రువపత్రంతో పాటు లక్ష రూపాయల నగదును అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఈ అవార్డును అందించారు.

హరిప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీలో విధులు నిర్వర్తించేవారు. ఉద్యోగరీత్యా 2018 సంవత్సరంలో జమ్మూకాశ్మీర్ లోని ఆర్మీ క్వార్టర్ లో నివాసముండేవారు. 2018 ఫిబ్రవరి 10 న వీరు నివాసముంటున్న క్వార్టర్ పై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో గాయాల పాలైన హిమప్రియ మనోధైర్యంతో వీరోచిత పోరాటం చేసింది. తన తల్లితో పాటు క్వార్టర్స్ లో ఉన్న కొంతమందిని కాపాడింది. ఉద్రవాదుల దాడిలో గాయాలైనప్పటికి ఆ చిన్నారి చేసిన సాహసానికి ఈ అవార్డ్ వరించింది.. సాహస బాలిక అవార్డుకు ఎంపికైన హిమప్రియను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా యంత్రాంగం అభినందించింది.. ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నుండి  హిమప్రియ తో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు..

https://twitter.com/MekapatiGoutham/status/1485463950929981441
Advertisement

తాజా వార్తలు

Advertisement