Tuesday, April 23, 2024

AP | పిడుగుపాటుకు బాలుడు మృతి.. అధికారులే కారణమంటూ ఆందోళన

గడివేముల, (ప్రభ న్యూస్): క‌ర్నూలు జిల్లాలో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. ఇవ్వాల (సోమ‌వారం) సాయంత్రం గ‌డివేముల‌ మండల కేంద్రంలో పిడుగుప‌డడంతో ఓ చిన్నారి చ‌నిపోయింది. గ్రామంలోని ఎరుకల పేటలో పిడుగుపాటుకు అనిరుద్ అనే బాలుడు చ‌నిపోయాడు. బాలుడి తల్లికి గాయాలయ్యాయి. దీంతో బంధువులు తమకు న్యాయం చేయాల‌ని ధర్నా చేశారు. తమ సామాజిక వర్గం ప్రభుత్వ స్థలాల్లో 20 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నామని, మూడు రోజుల క్రితం తహసిల్దార్ ప్రభుత్వ స్థలాలను ఖాళీ చేయించడంతో ఆరుబయట నివాసం ఉంటున్నామ‌ని తెలిపారు.

దీంతో పిడుగుపాటుకు తమ బాలుడు మరణించాడని, అధికారుల నిర్లక్ష్యం కార‌ణంగా చ‌నిపోయాడ‌ని రోడ్డుపై ఆందోళ‌నకు దిగారు. ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ కొత్త బస్టాండ్ కూడలిలో ధర్నా నిర్వహించారు. దాదాపు రెండు గంటలు ట్రాఫిక్ కి అంతరాయం క‌లిగింది. అధికారులు స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement