Wednesday, April 24, 2024

Flash Flash: చిత్తూరు జిల్లాలో నాటుబాంబు పేలుడు.. ఉలిక్కిప‌డ్డ జ‌నం..

శాంతిపురం, ప్రభ న్యూస్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని శాంతిపురం మండల కేంద్రంలో నాటు బాంబు పేలడంతో ఒకసారి గా జనం ఉలిక్కిపడ్డారు. నిత్యం జనాలు ప్రయాణికులు ,ఆటో స్టాండ్ వద్ద ఉదయం ఆరు నుండి రాత్రి వరకు జన ప్రవాహంలో ఉన్న శాంతిపురం ఒక్కసారిగా నాటు బాంబు పేలిందని తెలియడంతో మండలం మొత్తం భయాందోళనకు గుర‌య్యారు. మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద ఎవ‌రు నాటు బాంబు పెట్టారో తెలియదు కానీ, అది ఒక్క‌సారిగా పేలింది.

గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. బాంబు ధాటికి ఓ వీధికుక్క చ‌నిపోయింది. పక్కనే ఉన్న ఆటో అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఆ ప‌క్క దుకాణంలో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివరాంపురం కోట గడ్డ గ్రామాలలో కొంతమంది అడవి పందుల కోసం నాటు బాంబు పెడతారు. వారేమైనా ఇక్కడ వచ్చి నాటు బాంబు పెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు . దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement