Wednesday, April 24, 2024

కృష్ణానదిలో మళ్లీ ప్రారంభం జల విహారం..

కరోనా సెకండ్ వేవ్ మందగించడంతో అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇక కృష్ణానదిలో మళ్లీ జలవిహారం కానునంది. కరోనా కారణంగా నిలిచిపోయిన జలవిహారాలను పునరుద్ధరించాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పర్యాటక ప్యాకేజీలను శనివారం నుంచి పునరుద్ధరించనుంది. ప్రస్తుతం కృష్ణానది నీటిమట్టం లాంచీల ప్రయాణానికి అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. కృష్ణా నదిలో విహారయాత్రలకు సంబంధించి పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్-శ్రీశైలం-సోమశిల . ప్రతి శనివారం యాత్రలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వారంలో మూడు ట్రిప్పులు వేస్తారు.

ఇది కూడా చదవండి: ఆఫ్ఘనిస్థాన్ లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement