Thursday, April 25, 2024

ఏపీవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు: ఎంపీ టీజీ ప్రకటన

ఏపీలో ప్రజలు, కార్యకర్తల ఇబ్బందులు, సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వెల్లడించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్‌కు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రజల కోసం చేసిన ఖర్చును వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ లాంటి పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement