ఏపీలో మూడు రాజధానుల అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ఇకపై సాధ్యం కాబోదని స్పష్టం చేశారు. ఏపీకి రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, తమ పార్టీ అభిమతం కూడా అదేనని ఆయన తేల్చి చెప్పారు. ఏపీకి 3 రాజధానులు అన్నది కేవలం ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోతుందని తెలిపారు. 3 రాజధానులు సాధ్యం కాదు కాబట్టే… బిల్లును ప్రభుత్వం పెట్టడం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement