Thursday, April 25, 2024

కొత్త జిల్లాల ఏర్పాటు.. జగన్ సర్కార్ ను మద్దతు పలికిన బీజేపీ నేత

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ బీజేపీ సమర్ధించింది. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, జిల్లాలపై పలు ప్రాంతాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమువుతున్నాయి. ప్రజలు, రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కొందరు బీజేపీ నేతులు ప్రభుత్వానికి మద్దుతు పలికారు. తాజాగా, బీజేపీ ఏపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

”కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సాగరతీరం కలపడం ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించింది. ఈ నిర్ణయం అభినందనీయం. నూతన ఆంధ్ర‌ ప్రదేశ్ కు శుభాకాంక్షలు” అని విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement