Tuesday, April 23, 2024

వైసీపీ ఎమ్మెల్యేపై కేంద్రానికి ఫిర్యాదు

కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ తెలిపారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చేస్తున్న దందాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను దోవుకుంటున్న ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలను హెచ్చరిస్తూ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ద్వారపూడి మాట్లాడారని మండిపడ్డారు. ముస్లింలు తలచుకుంటే మీరెంత అని అనడం వెనక ఉద్దేశం ఏంట ? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలకు ముస్లిం పెద్దలే ఆశ్చర్యపోయారన్నారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ద్వారంపూడికి బుద్ధి చెప్పడానికి బీజేపీ కార్యకర్తలు చాలని బిట్ర శివన్నారాయణ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement