Saturday, April 20, 2024

BIG BREAKING : వివేకా హత్య కేసు విచారణలో సుప్రీంలో కీలక పరిణామం

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సుప్రీంకోర్టులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సీబీఐ సూచించిందిం. రాంసింగ్ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి ఎం ఆర్ షా తెలిపారు.

విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని తులశమ్మ కోరారు. ఆ విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. మధ్యాహ్నం 2గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామన్న ధర్మాసనం. ఏప్రిల్ 15వ తేదీకల్లా వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ తెలిపింది. కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలైనా పడుతుందని, ఈలోగా ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులశమ్మ తరపు న్యాయవాది కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement