Tuesday, April 23, 2024

లక్ష్మీపురంలో వరద ఉధృతిని పరిశీలించిన భూమన

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్ : తిరుపతి నగరంలో వరద బాధితులకు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఈరోజు స్థానిక లక్ష్మీపురం కూడలి వద్ద వరుసగా మూడో రోజు కూడా వరద ఉధృతి కొనసాగుతున్న కారణంగా ఆ ప్రాంతాన్ని కరుణాకర రెడ్డి పరిశీలించారు.

ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడుతూ… నగరంలో అనేక చోట్ల వర్షపు నీరు పొంగిపొర్లుతోందన్నారు. తాను అనేక ప్రాంతాల్లో పర్యటించానని, అదే విధంగా కార్పొరేటర్లు, అధికార యంత్రాంగం అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ, సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, వసతి సౌకర్యాలతో పాటు, వారికి భోజనాలు, నీటి సౌకర్యాలను కల్పించడం వంటి ఏర్పాట్లు జరుగు తున్నాయన్నారు. అయితే ఇంకా అనేక చోట్ల యదాతధ స్థితికి రాలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు భూమన కరుణాకర రెడ్డి సమాధానమిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement