Saturday, April 20, 2024

బీసీలకు సముచిత స్థానం కల్పించిన సీఎం

ఏపీ అసెంబ్లీలో బీసీల జనగణను తీర్మానం చేసి బీసీలకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నందికొట్కూరు మార్కెట్ యార్డులో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆదేశాల మేరకు బీసీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలను గుర్తించి వారికి రాజకీయ పరంగా సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు సీఎం అండగా ఉంటూ అన్ని పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలను అట్టడుగు స్థాయి నుండి పైకి తీసుకొచ్చారని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ల పరంగా పదవులు వచ్చేలా కృషి చేసిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement