Wednesday, April 24, 2024

సింహాద్రి అప్పన్న సేవలో ‘అఖండ’

‘అఖండ’ మూవీ విజయంతో నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. అఖండ సినిమా ‘అఖండ’ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం సింహాచలంలో సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు‘అఖండ టీం అప్పన్న సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖండ సినిమా విజయం సాధించిన సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకున్నామని అన్నారు. సినిమాకు మంచి ఆదరణ చూపించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా విజయం మాత్రమే కాదు… చిత్ర పరిశ్రమ విజయం అని పేర్కొన్నారు. ఈ సినిమాతో చలన చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పారు. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు.

కాగా, డిసెంబ‌ర్ 2న ‘అఖండ’ సినిమా విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌ల అయిన రోజు నుంచే అఖండ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement