Thursday, April 18, 2024

Breaking: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి స్వల్ప అస్వస్థత..

ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర వికేంద్రీకరణలో భాగంగా కర్నూలు ఎస్ టి బి సి కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రజలు, మేధావులు, విద్యా వేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైయస్ఆర్ సీపీ నేతలు రాయలసీమ గర్జన సభకు హాజరయ్యారు. అయితే రాయలసీమ గర్జన సభకు హాజరైన అశేష జనాన్ని ఉద్దేశించి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రసంగిస్తుండగా… ఉన్నట్లుండి స్వల్ప అస్వస్థత కు గురయ్యారు. సభా వేదికపై కళ్లు తిరిగి కింద పడిపోయారు బైరెడ్డి. దీంతో అక్కడే ఉన్న వైసీపీ నేతలు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement