Thursday, April 25, 2024

బద్మాష్ చంద్రబాబూ, నువ్వు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించావ్‌: మంత్రి జయరాం

క‌ర్నూలు (ప్ర‌భ న్యూస్‌): రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేద‌ని, పైగా రాయలసీమ పర్యటన పేరుతో ప్రజల్ని రెచ్చ‌గొట్టేలా చంద్ర‌బాబు య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం. చంద్రబాబుకు ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయని, ఆయనను ప్రజలు ఇప్పటికే ఇంటికి పంపించేశార‌న్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును, ఆయన పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు చాలా హీనంగా మాట్లాడారు.. ఆయనకు వయసు మీదపడి మధిభ్రమించిందని మంత్రి వ్యాఖ్యానించారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదనీ వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాం, ఆయన కుమారుడు లోకేష్ కార్పొరేటర్ కు కూడా గెలవలేడు కాబట్టి.. అతనికి కో ఆప్షన్ మెంబర్ పదవి ఇస్తామని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మంత్రి గుమ్మనూరు జయరాం ఫైర్ అయ్యారు.

జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి.. ఇంకో 30ఏళ్లు సీఎంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బద్మాష్ చంద్రబాబు.. బీసీ మంత్రిని, వాల్మీకి నేతను అయిన నన్ను కూడా బెంజ్ మంత్రి అని దుష్ప్రచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరి రూ.2లక్షల కోట్లు ఎలా సంపాదించావు అని చంద్రబాబుని ప్రశ్నించారు. బుద్దిలేని చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. మద్యం నేను అమ్మిస్తున్నానని రుజువు చేస్తే.. సగం మీసం తీసేయడానికి రెడీ.. నువ్వు నిరూపించలేకపోతే అర్థ గడ్డం తీసేసి తిరుగుతావా? అన్నారు. దమ్ముంటే తన చాలెంజ్ స్వీకరించాల‌ని స‌వాల్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement