Saturday, April 20, 2024

సీతమ్మలాంటి భువనేశ్వరిని అవమానిస్తారా?: రాజేంద్ర ప్రసాద్ ఫైర్

దేవాలయం లాంటి అసెంబ్లీని కౌరవ సభ లాగా చేశారని టీడీపీ సీనియర్ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సీతమ్మలాంటి భువనేశ్వరిని అవమానించిన వైసీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించక తప్పదు వార్నింగ్ ఇచ్చారు. ఉయ్యూరు ప్రధాన కూడలి వద్ద సీఎం జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, వంశీ, రోజా పోస్టర్లను టీడీపీ నాయకులు తగలబెట్టారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అన్న నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరిని అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన వైసీపీ నాయకులకు పుట్టగతులు ఉండవన్నారు. వైసీపీ నాయకుల మాటలతో పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకం మొత్తం మనోవేదనకు గురైందన్నారు. అసమర్థత ముఖ్యమంత్రి కేవలం బాబాయ్ గొడ్డలి వేటుని సైడ్ ట్రాక్ చేసేందుకు ఈ నాటకాలు ఆడిస్తున్నాడన్నారని ఆరోపించారు.  చంద్రబాబు చేత కన్నీరు పెట్టించి సైకో ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర, మన బిడ్డల భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తాపత్రేయం అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement