Tuesday, April 23, 2024

In health : ఏఐజీలో చేరిన‌ అవినాష్ త‌ల్లి.. తండ్రి భాస్క‌ర్ రెడ్డికి అస్వ‌స్థ‌త‌..

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న ఆయనకు శుక్రవారం ఒక్కసారిగా బీపీ పెరిగింది. దీంతో భాస్కర్ రెడ్డిని జైలు సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాస్కర్ రెడ్డి సతీమణి శ్రీలక్ష్మీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రికి తరలించారు. ఆమె వెంట కుమారుడు అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement