Friday, April 26, 2024

ఆస్తి తగాదాల వల్లే వివేకానంద హత్య – అవినాష్ రెడ్డి

హైదరాబాద్ . ఆస్తి తగాదాల వల్లే వివేకానంద హత్య గురైయ్యారు అని ఎంపి అవినాష్ రెడ్డి అన్నారు. సీబీఐ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ, అల్లుడు, కుమార్తె ఈ హత్య చేసి ఉండ వచ్చు అని పరోక్షంగా సునీత, ఆమె భర్త పై ఆరోపణ చేశారు.”.2006 నుంచి ఓ మహిళతో వివేకాకు సంబంధం ఉంది. షేక్‌ షహన్‌షా అనే అబ్బాయి వారికి పుట్టాడు. వివేకా ఇంట్లో డాక్యుమెంట్లు కోసం కొందరు వెతికారు. ఆస్తి తగాదాల కోసమే హత్య జరిగినట్లు భావిస్తున్నా. ఈ కేసులో సీబీఐ అన్ని కట్టుకథలు అల్లుతోంది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖను మధ్యాహ్నం వరకు సునీత భర్త ఎవరికీ ఇవ్వలేదు. నన్ను ఘటనా స్థలానికి వెళ్లమని చెప్పిందే వాళ్లు.. లేఖ విషయం బయటకు చెప్పకపోవడం పెద్ద నేరం. నేను గుండెపోటు అని ఎప్పుడూ చెప్పలేదు. ఇది అప్పటి టీడీపీ ప్రభుత్వం సృష్టించిన కట్టుకథ నేనే పోలీసులకు సమాచారం అందించా. రాజకీయ కుట్రలను తప్పకుండా ఛేదిస్తాం” అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement