Friday, April 19, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో బొలెరో -ఆటో ఢీ: ఆరుగురు మృతి

శ్రీసత్యసాయి జిల్లాలో. శుక్రవారం సాయంత్రం బొలెరో , ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్పాట్‌లోనే 5గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్లుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement