Wednesday, March 27, 2024

పూజ‌ల్లో అధికారులు.. వ‌ర‌ద బాధితుల ఆగ్ర‌హం

తిరుపతిరూరల్ : రామచంద్రాపురం మండలం పరిధిలోని వరద ముంపు గ్రామాలైన‌ రాయలచెరువు పేట, కాలేపల్లి, గొల్లపల్లి గ్రామాల ప్రజలు ఆర్ధనాదాలతో అల్లాడుతుంటే అవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు రాయల అమ్మవారి పూజలో తలమునకలై తేలుతున్నారు. ఒకవైపు రాయలచెరువు కట్ట గండి పడి ప్రమాదంలో ఉన్నా.. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు ఇలా పూజలు చేస్తూ కాలక్షేపం చేయడం పట్ల స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement