Friday, April 19, 2024

వైసీపీ మూడేళ్ల పాల‌న‌లో.. దాడులు, అత్యాచారాలు : అచ్చెన్నాయుడు

వైసీపీ మూడేళ్ల పాల‌న‌లో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయ‌ని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి… సామాన్య ప్రజలు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ఏపీకి సీఎం కావాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మూడేళ్ల పాలనలోనే జగన్ నైజం, ఆయన అసమర్థ పాలన గురించి వైసీపీ కార్యకర్తలు, అభిమానులకు కూడా అర్థమైంద‌న్నారు.

జగన్ పాలనపై వైసీపీ శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయని చెప్పారు. ఈసారి తమ సొంత పార్టీ గెలిచే పరిస్థితి లేదని వాళ్లే చెపుతున్నారని తెలిపారు. కల్తీ మద్యం, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, అభివృద్ధి లేద‌ని, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు చేసింద‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement