Thursday, April 25, 2024

వైసిపి మహిళా సర్పంచ్‌పై దాడి.. సొంత పార్టీ వారిపై ఫిర్యాదు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మేజర్‌ పంచాయతీ వైసీపీ సర్పంచ్‌ ఆర్‌.లక్ష్మి పై సొంత పార్టీ వారే దాడికి చేశారు. తనను కులం పేరుతో దూషించిన అంటూ సొంత పార్టీ నేతల పైన ఆమె ఫిర్యాదు చేశారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ ఆర్‌.లక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌ అనకాపల్లి గోవింద, సర్పంచ్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఉప సర్పంచ్‌ సోదరుడు సమావేశంలోకి చొచ్చుకు రావడం రసాభాస చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెపై దాడి జరిగింది.

దళిత మహిళా సర్పంచ్‌నన్న అక్కసుతో సొంత పార్టీ వారే నాపై దాడి చేసి కులం పేరుతో దూషించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆమె పొందూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులంపేరుతో దూషించడమే కాకుండా దాడికి దిగినట్టు సర్పంచ్‌ లక్ష్మి ఫిర్యాదు చేశారు. ఐదుగురు వ్యక్తులు తనపై దాడికి దిగినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు సర్పంచ్‌ లక్ష్మి తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement