Saturday, April 20, 2024

Crime: ఇద్దరు యువకులపై కత్తితో దాడి.. ఒకరు మృతి

పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లులో ఇద్దరు యువకులపై  దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో ఒక స్టూడియో నిర్వాహకుడు సురేష్ మృతి చెందగా.. వస్త్ర దుకాణ యజమాని రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నాకు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement