Wednesday, April 24, 2024

పొలం తగాదా లో ఇరువర్గాల దాడి..

ఆళ్లగడ్డ, ప్రభన్యూస్ : ఆళ్ళగడ్డ మండలం ఓబులం పల్లి లో పొలం విషయంలో ఇరువర్గాలు బుధవారం రాత్రి దాడి చేసుకున్నారు. పొలం విషయంలో చాలా రోజుల నుండి ఇరువర్గాల మధ్య తగాదాలు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు రాళ్లు, కత్తులతో దాడులు చేసుకోవడమే కాకుండా కళ్లలో కారంపొడి చల్లుకున్నారు. దీంతో ఒకే వర్గానికి చెందిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

బాధితులను ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. అడిషనల్‌ డీఎస్పీ రాజేంద్ర ఆసుపత్రికి చేరుకొని భూ తగాదా పై విచారణ చేపట్టారు. గాయపడ్డ క్షేతగాత్రుల్లో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement