Saturday, April 20, 2024

తిరుపతి జిల్లాలో దారుణం.. వివాహితను నిర్బంధించిన కామాంధుడు, నెల రోజులు పాటు అత్యాచారం

తిరుపతి రూరల్‌, ప్రభ న్యూస్‌ : వెదురుకుప్పం మండలం, జలిజ పల్లెకు చెందిన ఓ వివాహిత (36) తిరుపతి రూరల్‌ మండలంలోని దుర్గసముద్రంలోని తన కుమార్తె ఇంట్లో ఉంటూ తిరుపతిలోని ఓ పాఠశాలలో పనిచేస్తోంది. బాధితురాలు తెలిపిన కథనం మేరకు… దుర్గసముద్రం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నవంబర్‌ 17న వివాహిత పనిచేస్తున్న పాఠశాల వద్దకు వెళ్లాడు. బ్యాంకు లోన్‌ తీయిస్తానని బలవంతంగా బైక్‌ పై తీసుకెళ్లాడు. ప్రతిఘటించడంతో దాడి చేశాడు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం పాకాల మండలం, దామలచెరువంలోని కూతురు వరుసైన శారద ఇంట్లో నిర్బంధించాడు.

మళ్లీ పలుమార్లు అత్యాచారం చేశాడు. వివాహిత చనిపోతానని చెప్పడంతో భయపడ్డ నాగరాజు ఆమెను స్వగ్రామంలో వదిలి పెట్టాడు. మానసికంగా కృంగి పోయిన వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో గ్రామస్తులు, కుటు-ంబ సభ్యులు అడ్డుకుని ధైర్యం చెప్పారు. గ్రామస్తులు సహకారంతో జనవరి 6వ తేదీన తిరుపతి ఎస్పీ కి ఫిర్యాదు చేసింది వివాహిత. ఎస్పీ దిశ పోలీసులకు కేసును బదిలీ చేశారు. డిఎస్పీ రామరాజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని మంగళవారం ఆమె దళిత సంఘాల నేతలతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement