శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బోల్తా పడ్డ ఘటన ఇవ్వాల (శుక్రవారం) జరిగింది. శ్రీకాకుళం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం డిప్యూటీ తహసీల్దార్ సతీశ్ చనిపోయారు. కాగా, ఈ ఘటనలో తహసీల్దార్ వెంకటరావుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు ఆఫీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. సబ్బవరం పెందుర్తి రోడ్డులో కారు బోల్తాకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ బాధితులను విశాఖలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. యాక్సిడెంట్లో డిప్యూటీ తహసీల్దార్ మృతి
Advertisement
తాజా వార్తలు
Advertisement