Thursday, March 28, 2024

శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. యాక్సిడెంట్‌లో డిప్యూటీ త‌హ‌సీల్దార్ మృతి

శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బోల్తా ప‌డ్డ ఘ‌ట‌న ఇవ్వాల (శుక్ర‌వారం) జ‌రిగింది. శ్రీకాకుళం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో శ్రీకాకుళం డిప్యూటీ త‌హ‌సీల్దార్ స‌తీశ్ చ‌నిపోయారు. కాగా, ఈ ఘ‌ట‌న‌లో త‌హ‌సీల్దార్ వెంక‌ట‌రావుకు కూడా తీవ్ర గాయాల‌య్యాయి. మ‌రో ఇద్ద‌రు ఆఫీసు సిబ్బంది కూడా గాయ‌ప‌డ్డారు. స‌బ్బ‌వ‌రం పెందుర్తి రోడ్డులో కారు బోల్తాకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ బాధితుల‌ను విశాఖ‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

డిప్యూటీ తహసీల్దార్​ సతీష్​
Advertisement

తాజా వార్తలు

Advertisement