Friday, April 19, 2024

ప్ర‌కాశం జిల్లాలో దారుణం.. తిరుణాలలో అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లాలో దారుణం జ‌రిగింది. కొండపి మండలంలోని జాళ్ల‌పాలెం గ్రామంలో కొత్తపల్లి వీరబ్రహ్మేంద్రస్వామి (ఉగాది) తిరునాళ్ల జ‌రుగుతున్నాయి. ఈ సందర్భంగా టెంట్లు వేసి తారజువ్వాలు కాల్చడంతో టెంట్లపై నిప్పు రవ్వలు ప‌డ్డాయి. దీంతో టెంట్లు కింద ఉన్న 4 బైక్ లు దగ్ధమ‌య్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చెరుకోని మంటలను ఆర్పేశారు. వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఆ ప్రాంతంలో ఎద్ద ఎత్తున తారా జువ్వలు కాల్చడంతోనే ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రికి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే తిరుణాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అటువంటి సమయంలో ఈ ఘటన జర‌గడం దురదృష్టకరమని స్థానికులు అంటున్నారు. అయితే అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఈదురు గాలులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చ‌ర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement