Thursday, April 25, 2024

దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

నందికొట్కూరు రూరల్ (ప్రభ న్యూస్) :నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పడమర పాతకోటలో కన్న తండ్రిని కొడుకు చంపిన దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొడుకు శ్రీకాంత్ భార్య గత కొంతకాలంగా భర్తతో గొడవపడి పుట్టినింటిలో ఉంటుందని, అందుకు తాగుడుకు బానిసైన శ్రీకాంత్ తన తండ్రి వెంకటేశ్వర్లుతో తన భార్యను కాపురానికి తీసుకుని రావాలని తరచూ మద్యం సేవించి గొడవపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అలానే నిన్న రాత్రి కూడా తాగి వచ్చి గొడవ పడుతుంటే శ్రీకాంత్ కు సర్దిచెప్పడంతో ఇంటిలో నుంచి బయటికి వెళ్లాడని, రాత్రి 12గంటల సమయంలో వచ్చి బయట వరండాలో పడుకున్న తన తండ్రి వెంకటేశ్వర్లుపై ఇనుపరాడ్ తో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడు శ్రీకాంత్ ను ముచ్చుమర్రి పోలీసులు అదుపులోకి తీసుకొని వెంకటేశ్వర్లు మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి చేరుకొని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement