Thursday, April 25, 2024

జగన్ కోరారు.. మోహిత్ పోటీ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : 2024 అసెంబ్లీ ఎన్నికలల్లో తనకు బదులుగా తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తాడని చంద్రగిరి శాసన సభ్యుడు, తుడా చైర్మన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గం పరిధిలోని పాకాలలో శుక్రవారం ఉదయం వైఎస్సార్ ఆసరా పథకం లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు..

ఆ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ సంబంధిత వ్యవహారాలు చూసుకోడానికి తన అవసరం అమరావతిలో ఉందని చెబుతూ వచ్చే ఎన్నికల్లో మీ అబ్బాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా పోటీ చేయించాలని చెప్పారని తెలిపారు. ఆయా నిర్దేశకత్వం మేరకు మోహిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా పోటీ చేస్తాడని ప్రకటించారు.. పక్కనే ఉన్న మోహిత్ రెడ్డిని సభకు పరిచయం చేస్తూ ట్యాంకు మద్దతుగా నిలిచిన వారు మోహిత్ విజయానికి కృషి చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement