Friday, April 19, 2024

హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తే అరెస్టులా : అచ్చెన్నాయుడు


ఉద్యోగుల‌ హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తే అరెస్టులు చేస్తారా అని ఏపీ మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజ‌రాప్ అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌న్నారు. ఉద్యోగుల పోరాటానికి టీడీపీ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. ప్రభుత్వం ఎవరికీ న్యాయం చేయడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే వారు ఉద్యమించాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తే… వారు ఉద్యమాలు చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement