Tuesday, April 23, 2024

1న తిరుపతిలో అప్రెంటీస్‌షిప్‌ జాబ్‌ మేళా : పోలా భాస్కర్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ, బోర్డు అఫ్‌ అప్రెంటీస్‌ టైనింగ్‌ చెన్నై సంయుక్తంగా జులై 1వ తేదీన తిరుపతిలో అప్రెంటీస్‌షిప్‌ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నాయని సాంకేతిక విద్యా శాఖా కమిషనర్‌ డా. పోలా భాస్కర్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమో పాస్‌ అయినవారు ఈ అప్రెంటీస్‌ షిప్‌ జాబ్‌ మేళాలో పాల్గొనుటకు అర్హులని, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ- ఇంజినీరింగ్‌ కళాశాలలో జులై 1 న ఉదయం 9.00 గంటలకు ఈ అప్రెంటీస్‌ జాబ్‌ మేళా ప్రారంభిస్తామన్నారు. ఈ మేళాలో 15 పైబడి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, కంపెనీలు పాల్గొని సుమారు 1500 మందికి అప్రెంటీస్‌ షిప్‌ అవకాశాలను కల్పించనున్నాయని ఆయన తెలిపారు.

2019 సెప్టెంబర్‌ తరువాత ఇంజినీరింగ్‌ లో డిగ్రీ మరియు డిప్లొమో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వెరిఫికేషన్‌ కోసం ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ తో పాటు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్స్‌ యొక్క జిరాక్స్‌ కాపీలు 3 సెట్లు-, బయో డేటా తో ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సిందిగా సూచించారు. అప్రెంటీస్‌ షిప్‌ ఫెయిర్‌ లో పాల్గొనే విద్యార్థులు తమ పేరును నేషనల్‌ వెబ్‌ పోర్టల్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ ఎంహెచ్‌ఆర్‌డీఎన్‌ఏటీఎస్‌ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌ లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ అప్రెంటీ-స్‌ షిప్‌ ఫెయిర్‌ కు హాజరు అయ్యే సమయంలో పేరు, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ వివరాలు, పాస్‌ అయిన సంవత్సరం పేర్కొంటూ యూసర్‌ ఐడి యొక్క నాలుగు సెట్లు ఫోటో కాపీని విద్యార్థులు తీసుకురావాల్సిందిగా సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement