Thursday, April 25, 2024

BIG BREAKING : AP SI పరీక్షా ఫలితాలు విడుదల..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ SI పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర‌ వ్యాప్తంగా ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఈనెల 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప‌రీక్ష‌కు 1,51,288 మంది అభ్యర్థులు హాజరవగా.. 57,923 మంది అర్హత సాధించారు. మార్చి 4వ తేదీ వరకు OMR షీట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశముంద‌ని APSLPRB పేర్కొంది. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి.

వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.

https://slprb.ap.gov.in/UI/SIResults or https://slprb.ap.gov.in/ క్లిక్ చేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement