Friday, April 19, 2024

AP Corona: ఏపీలో 222 మందికి కరోనా..

ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గింది. గడచిన 24 గంటల్లో 31,473 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 222 మందికి పాజిటివ్ గా తేలింది. గుంటూరు జిల్లాలో 38, విశాఖ జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 28, నెల్లూరు జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు వెల్లడైంది. అదే సమయంలో 275 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,738 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,53,755 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 2,560 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 14,423కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement