Saturday, April 20, 2024

AP: రేషన్ దిగుమతి బంద్.. ఇదీ డీలర్ల డిసిషన్.. ఎందుకంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేష‌న్ డీల‌ర్ల స‌మ్మె ఉప‌సంహ‌ర‌ణ‌కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో మ‌రో కొత్త స‌మ‌స్య త‌లెత్తింది. రేషన్‌ షాపుల బంద్‌కు పిలునిచ్చిన డీలర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. కాగా, తమ సమస్యలు పరిష్కరించే దాకా రేషన్ దిగుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద మాత్రం ధర్నాలు చేస్తామ‌ని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించే దాకా వచ్చే నెల స్టాక్‌ను దిగుమతి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు.

ముందుగా పంపిణీ కూడా నిలిపివేస్తామని ప్రకటించినా ఆ తర్వాత త‌మ నిర్ణయాన్ని వాప‌స్ తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలని డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.

గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే ప్రతీ సంచికి రూ.20 ఇస్తామని ప్రకటించిన స‌ర్కారు, ఇప్పుడు నగదు ఇవ్వమని చెప్పడం సరికాదన్నారు డీలర్లు. గోనె సంచులు తిరిగి ఇవ్వకపోతే కేసులు పెడతామని హెచ్చిర‌స్తున్నార‌న్నారు.

గోనె సంచులను ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తుచేశారు. ఏపీలోనూ జీవో 10ని యథాతథంగా అమలు చేయాలని రేషన్‌ డీలర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కమిషన్‌ బకాయిలు 2020 నుంచి చెల్లించడం లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వచ్చేనెల రేషన్‌ సరుకులు దిగుమతి చేసుకోకూడదని తీర్మానం చేసిన‌ట్టు వారు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే బంద్‌ కు దిగుతామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement