Wednesday, April 24, 2024

ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి బొత్స ఆదేశాలు..

ఏపీలో భారీ వర్షాలపై మంత్రి బొత్స సత్యనారయణ మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తమ పరిధిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, వర్షాల దృష్ట్యా అన్ని చోట్ల కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, జాగ్రత్త చర్యల్లో వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బొత్స స్పష్టం చేశారు.

ఇద కూడా చదవండి : తెలంగాణలో ఉపఎన్నికలొస్తేనే అభివృద్ధి.. కేసీఆర్ ప్లాన్ పై షర్మిల సెటైర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement