Tuesday, April 16, 2024

20న ఎపీ పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు..

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన నిర్వహించిన పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌ – 2023) ఫలితాలను 20వ తేది శనివారం విడుదల చేయనున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక, నైపుణ్యాభివృద్ధి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేతుల మీదుగా ఫలితాల విడుదల జరుగుతుందన్నారు.

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి 2023-24 విద్యా సంవత్సరానికి సంభందించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి పాలిసెట్‌ – 2023 పరీక్ష నిర్వహించగా 1,43,625 మంది హాజరయ్యారన్నారు. పాలిటెక్నిక్‌ ప్రవేశానికి సంబందించిన వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ వివరాలను సైతం అదే రోజు ప్రకటిస్తామన్నారు. ఫలితాలు, ర్యాంకుల వివరాలను ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల అనంతరం https://polycetap.nic.in/Default.aspx నుండి పొందవచ్చనని చదలవాడ నాగరాణి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement