Monday, March 25, 2024

AP Politics: చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు.. క‌థ వేరేలా ఉంటది.. ప‌రిటాల సునీత సంచ‌ల‌న కామెంట్స్‌

AP: మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓకే అంటే తాను ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. చంద్రబాబు ఆయన గంటసేపు కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుందని వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. తమదీ సీమ రక్తమేనని, తమకు బీపీ వస్తుందని పరిటాల సునీత ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న రాజకీయ రగడపై వ్యాఖ్యానించారు.

అటు, సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు సైతం ఇవాళ మండిప‌డ్డారు. త‌మ నేత‌ల‌పై ఏపీ మంత్రులు బూతు వ్యాఖ్యలు చేస్తున్నార‌ని ఆరోపించారు. తాము ఏపీలో అధికారంలోకి వ‌స్తామ‌ని, జగన్ రెడ్డి ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని కాల‌రాస్తున్న‌ ఏపీ మంత్రులతో పాటు అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతామ‌న్నారు. ఎన్నో కేసుల్లో జ‌గ‌న్ ముద్దాయిగా ఉన్నారని ఆయ‌న గుర్తు చేశారు. ఏపీలోని 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి తాము చెబుతోంటే.. దాన్ని పక్కదారి పట్టించడానికే త‌మ కార్యాల‌యాలు, ఇళ్లపై దాడులు జ‌రుపుతున్నార‌ని దేవినేని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement