Wednesday, April 24, 2024

AP Politcs: టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష షురూ

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి నడుమ బాబు దీక్ష ప్రారంభించారు. సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైన దీక్ష రేపు రాత్రి 8 గంటలకు ముగియనుంది. అధినేత దీక్ష నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగుదేశం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు కూడా మంగళగిరికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement