Friday, April 19, 2024

AP: సీఎం జగన్ తో నాగార్జున లంచ్

ఏపీ సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డితో సినీ నటుడు నాగార్జున గురువారం భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో నాగార్జున సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా నాగార్జునతో పాటు సినీ నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి మరికొందరున్నారు.

ఈ భేటీ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన ప‌లు అంశాలపై వారు చర్చించారు. సినీ రంగానికి వైసీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు జగన్ తో కలిసి నాగార్జున భోజనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement