Saturday, April 20, 2024

యువతిపై పెట్రోల్ దాడి.. దిశ యాప్ తో రక్షించామన్న మంత్రులు

విజయనగరం జిల్లా చౌడువాడలో యువతిపై పెట్రోల్ దాడి దురదృష్టకరమని మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ అన్నారు.  శుక్రవారం పెట్రోలు దాడిలో గాయపడిన బాధితురాలిని ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు.  ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడన్నారు. దిశ యాప్ కారణంగానే బాధితులను సకాలంలో కాపాడగలిగామని తెలిపారు. యాప్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారని చెప్పారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. చీటికీ.. మాటికీ.. ప్రభుత్వంపై బురద జల్లడం, ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై రాజకీయం చేయడం తగదని హితవుపలికారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని మంత్రులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండిః కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement