Thursday, April 25, 2024

శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి ఆర్కే రోజా

తిరుపతి సిటీ : దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి , ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వార్లని ఏపీ క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజా ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. శారదా పీఠంలో శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ… రాష్ట్రంలో భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం పర్యాటక శాఖ ద్వారా పర్యాటకంగా తీసుకుంటున్నటువంటి చర్యలు స్వామివారికి వివరించారు. స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పర్యాటక శాఖ మంత్రిగా రోజా పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్నటువంటి చర్యలు తన దృష్టికి వచ్చాయని చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారని రోజాని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement