Thursday, March 28, 2024

రాయలసీమకు నీరిస్తామని కేసీఆరే చెప్పారు: మంత్రి పెద్దిరెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ముదురుతోంది. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీరిచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ స్వయంగా జగన్‌కు చెప్పారని తెలిపారు. నాడు కేసీఆర్ మాటలకు ప్రత్యక్ష సాక్షిని తానేనని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. తాము అక్రమంగా నీళ్లు తీసుకోమని, అక్రమ ప్రాజెక్టు కట్టడం లేదన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక వైఎస్సార్‌ను కేసీఆర్ పొగిడింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. తెలంగాణకు వైఎస్ ఎంతో మేలు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు వైఎస్ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని పెద్దిరెడ్డి హితవు పలికారు. రాయలసీమలో ప్రతి ఊరుకు నీళ్లివ్వాలని స్వయంగా కేసీఆర్ చెప్పారని ఉద్ఘాటించారు. తెలంగాణ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని, ఏపీకి రావాల్సిన వాటాను మాత్రమే వాడుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఎక్కువ నీరు వాడుకోవాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: వైఎస్ న‌ర‌రూప రాక్ష‌సుడు.. ప్ర‌జ‌ల‌కు గుక్కెడు నీళ్లు ఇవ్వ‌లేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Advertisement

తాజా వార్తలు

Advertisement