Saturday, April 20, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ మంత్రి భేటీ.. చర్చించిన అంశం ఏంటంటే..

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమైయ్యారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలను సమర్పించారు. సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశంగల ప్రాంతాల గురించి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు. సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతిపత్రం అందించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా?: సూర్యపేటలో జైభీమ్ ఘటనపై రేవంత్ ఫైర్

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement