Tuesday, April 23, 2024

రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. అయితే వ్యతిరేకతకు గల కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలు అర్థం చేసుకోకపోవడమేనని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంస్కరణలు తీసుకొచ్చే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం సర్వసాధారణమని తెలిపారు.

అయితే సంస్కరణలు చేపట్టిన తొలినాళ్ళల్లో ఫలితాలు ముందుగా రావని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతూ… న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి… అతి ముఖ్యమైన పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement