Thursday, April 25, 2024

జగన్ కేబినెట్ లో కొత్త వారికే ఛాన్స్: మంత్రి బాలినేని సంచలన ప్రకటన

ఏపీలో వైసిపి అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తికానున్న సమయంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొంతమందిని పక్కనపెట్టి కొత్తవారిని తీసుకుంటారని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ విస్తరణపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ లో 100 శాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని బాలినేని వెల్లడించారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన మంత్రి పదవి పోయినా బాధపడనని, సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. తనకు పార్టీయే ముఖ్యమని, పదవులు ముఖ్యం కాదని బాలినేని స్పష్టం చేశారు కాగా బాలినేని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement